ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలుగన్న ఆ యువతి తాను అనుకున్నట్లుగానే కొలవు సాధించింది. జీవితంలో స్థిరపడినట్లే అని భావించిన ఆ యువతి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయాలని భావించారు. ఆమెకు తగినట్లుగా మంచి సంబంధం చూశారు. నిశ్చితార్థం కూడా జరిపించారు. అంతా బాగుందనుకున్న సమయంలో ఊహించని రీతిలో ఆ యువతి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చల్లకెరె తాలూకా రెకళ్లగెరె గ్రామంలో జరిగింది.
గ్రామానికి చెందిన మానస అనే యువతి 22 ఏళ్లకే ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. చల్లకెరె తాలూకాలోని నగరన్గెరె గ్రామంలో ఉన్న పోస్టాఫీసులో విధులు నిర్వహిస్తోంది. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగితో ఆమె పెళ్లికి పెద్దలు ఫిక్స్ చేశారు. నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. యాసిడ్ సేవించిన ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.