ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ కు లేఖ రాసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 07, 2021, 01:26 PM

విజయవాడ: పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా ఊళ్లు ఖాళీ చేయమనడం భావ్యమా? ఈ రోజు సంతకు వెళ్లి తిరిగి వస్తున్న నిర్వాసితులను వారి గ్రామాలకు వెళ్ళనీయకుండా పోలీసులు అడ్డుకోవడం విచారకరం. బాధిత కుటుంబాలపై పోలీసులు, రెవెన్యూ సిబ్బందిని ప్రయోగించి అర్ధాంతరంగా ఊళ్ళను ఖాళీ చేయమని బెదిరించడం దుర్మార్గం. నిర్వాసితులకు అండగా అఖిలపక్షం ఈ రోజు పోలవరం ముంపు గ్రామాల్లో నిరసనలు చేపట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఇప్పటికైనా స్పందించి పోలవరం నిర్వాసితుల సమస్యను పరిష్కరించండి. ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించి, ఆర్ & ఆర్ ప్యాకేజీ ఇచ్చేందుకు చర్యలు చేపట్టండి... రామకృష్ణ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com