ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దారుణం.. కూతురికి ఉరేసి తల్లి ఆత్మహత్య

national |  Suryaa Desk  | Published : Fri, Jul 02, 2021, 01:11 PM

కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి దారుణానికి పాల్పడింది. కన్న కూతురిని ఉరివేసి చంపి.. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని కోలారు జిల్లాలో జరిగింది. మృతులను భానుప్రియా (21), నిధి (2)గా గుర్తించారు. తల్లి భాను ప్రియా ముందుగా కుమార్తెను కిటికీకి ఉరివేసి హత్య చేసింది. అనంతరం తానూ కూడా ఉరివేసుకుంది. భాను ప్రియా మూడేళ్ల కిందట పెద్దల్ని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలిసింది. ఇటీవలి కాలంలో కుటుంబ కలహాలు అధికం కావడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com