ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లేడీ కానిస్టేబుల్‌ వలలో డీఎస్పీ

national |  Suryaa Desk  | Published : Thu, May 20, 2021, 11:54 AM

హైదరాబాద్‌లో లేడీ కానిస్టేబుల్ హనీట్రాప్ వ్యవహారం మరువక ముందే మరో ఘటన రాజస్థాన్‌లో వెలుగుచూసింది. ఏకంగా డీఎస్పీకే వలపు వల విసిరిన లేడీ కానిస్టేబుల్ అతనికి బాగా దగ్గరైంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో శారీరక సంబంధం పెట్టుకున్నారు. ఒకే జిల్లాలో పోస్టింగ్ రావడంతో రాసలీలలు సాగించారు. తీరా ఆ వ్యవహారం బయటపెడతానంటూ ఆమె బ్లాక్‌మెయిల్‌కి దిగడంతో డీఎస్పీకి దిమ్మతిరిగిపోయింది. రేప్ కేసు పెడతానంటూ డీఎస్పీకి చుక్కలు చూపించింది. లక్షల రూపాయలు కొట్టేసింది. అయినా అత్యాశ చావక అడ్డంగా బుక్కైంది.


బుండి జిల్లాలోని హిందోలి డీఎస్పీగా పనిచేస్తున్న శ్యామ్ సుందర్ బిష్ణోయి 2019లో రాజస్థాన్ పోలీస్ సర్వీసెస్‌కి ఎంపికయ్యాడు. రాజస్థాన్ పోలీస్ అకాడమీలో ఉన్న సమయంలో అక్కడ పనిచేస్తున్న లేడీ హెడ్ కానిస్టేబుల్‌తో పరిచయమై శారీరక సంబంధానికి దారితీసింది. అనంతరం ఇద్దరికీ బుండి జిల్లాలో పోస్టింగ్ రావడంతో రాసలీలలు సాగించారు. కొద్దిరోజులకే లేడీ కానిస్టేబుల్ నిజస్వరూపం బయటపెట్టింది. తమ రాసలీలల వ్యవహారం బహిర్గతం చేస్తానంటూ కొత్త డీఎస్పీని బెదిరించడం మొదలుపెట్టింది.


అతనిపై రేప్ కేసు పెడతానంటూ బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు వసూలు చేసింది. సుమారు ఐదున్నర లక్షలు కొట్టేసి కిలాడీ కానిస్టేబుల్‌ అత్యాశకు పోయి అడ్డంగా బుక్కైంది. తనకు మొత్తం రూ.50 లక్షలు కావాలని డిమాండ్ చేయడంతో డీఎస్పీ పోలీసులను ఆశ్రయించాడు. ఇద్దరి సమ్మతితోనే శారీరక సంబంధం పెట్టుకున్నామని.. ఇప్పుడు రేప్ కేసు పెడతానని బ్లాక్‌మెయిల్ చేస్తోందని కేసు పెట్టాడు. శాస్త్రి నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె ఫోన్ కాల్ లిస్ట్‌, తదితర ఆధారాలు సేకరించి ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. కేసు విచారణ కొనసాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com