హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలుగుదేశంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు రాకుండా తనను అడ్డుకోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకుని తనపై దౌర్జన్యం చేశారని రోజా ఆరోపించారు. ఏపీ డీజీపీ చట్టబద్ధంగా నడుచుకోవడం లేదని అన్నారు. ఆయన చంద్రబాబు కనుసన్నల్లో పని చేస్తున్నారని అన్నారు. ఏపీలో ఉండే అర్హత తనకు లేదా? అని రోజా ప్రశ్నించారు. మహిళా పార్లమెంటేరియన్ సదస్సు సాక్షిగా తనను అవమానాలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.