పత్తిపాడు నియోజకవర్గంలోని ప్రజలు పోలీస్ నిబంధనలు ఉల్లంగించొద్దని, పత్తిపాడు ఎమ్యెల్యే, రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. మహమ్మారి కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం (నిన్న ) నుంచి మధ్యాహ్నం 12గంటల తర్వాత కర్ఫ్యూ అమలు చేస్తున్న నేపథ్యంలో పత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని అన్నీ రంగాల వ్యాపారస్తులు, రైతులు ప్రజలు ప్రభుత్వానికి పోలీసులకు సహకరించి దయచేసి ఇంటి నుంచి బయటకు ఎవరూ రావద్దని పత్తిపాడు ఎమ్యెల్యే మేకతోటి సుచరిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.