ట్రెండింగ్
Epaper    English    தமிழ்

268 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

national |  Suryaa Desk  | Published : Tue, May 04, 2021, 05:23 PM

ఇతర వివరాలు: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) సంస్థ 268 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పంజాబ్, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, గుజరాత్, మధ్య ప్రదేశ్, అస్సాం, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఈ ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.


ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ. 35 వేల వరకు వేతనం చెల్లిస్తారు. రెండో ఏడాది నెలకు రూ.40 వేలు, మూడో ఏడాది నెలకు రూ.45 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. నాలుగో ఏడాది నెలకు రూ. 50 వేల వేతనం ఉంటుంది.


అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్, టెలీ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ సైన్స్ తదితర విభాగాల్లో బీఈ/బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.


వయసు: అభ్యర్థుల వయస్సు 32 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఐదేళ్ల పాటు.. ఓబీసీ విద్యార్థులకు మూడేళ్ల పాటు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.


ఎంపిక విధానం: బీఈ/బీటెక్‌లో సాధించిన మార్కులు, గత అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్‌ 21, 2021


దరఖాస్తుకు చివరితేది: మే 5, 2021


దరఖాస్తు ఫీజు: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు)


వెబ్‌సైట్‌:https://bel-india.in/






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com