ఎస్బీఐ తన ఖాతాదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల గృహ రుణాలపై అందించే వడ్డీ రేటును తగ్గించిన ఎస్బీఐ ఇప్పుడు మరో శుభవార్త అందించింది. చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో తమ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేవైసీ అప్ డేట్ కోసం పత్రాలను మెయిల్ లేదా పోస్ట్ ద్వారా సమర్పించవచ్చని ఎస్బీఐ తెలిపింది. అంతేకాకుండా కేవైసీ అప్ డేట్ గడువును మే 31 వరకు పొడిగించింది.