ఇప్పటికే పలువురు ప్రముఖులను పొట్టన పెట్టుకున్న కరోనా తాజాగా కేంద్ర మంత్రి ఇంట్లో విషాదాన్ని నింపింది. కేంద్ర మంత్రి తావర్ చంద్ గహ్లోత్ కుమార్తె గోయిత సోలంకి (42) కరోనాతో ప్రాణాలు విడిచారు. కరోనా బారిన పడ్డ ఆమె ఇండోర్లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల్లో 80 శాతం వైరస్ బారిన పడటంతో ఆమెను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆమె మరణం పట్ల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్, చౌహాన్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. శర్మ, పలువురు పార్టీ నేతలు విచారం వ్యక్తం చేశారు.