ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గన్నవరం ఎయిర్ పోర్ట్ లో కొత్త రూల్స్!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 04, 2021, 12:02 PM

నేటి నుంచి ప్రభుత్వం గన్నవరం ఎయిర్ పోర్ట్ లో కఠిన ఆంక్షలు అమలు చేయబోతోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ పోర్ట్ ఆవరణలోకి ప్రయాణికులను మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. కారులో వచ్చే ప్రయాణికుడి వెంట డ్రైవర్ కు మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రయాణికుడికి వీడ్కోలు పలికేందుకు వచ్చే బంధువులను ప్రధాన ద్వారం వద్దే నిలిపివేయనున్నారు. ప్రస్తుతం విదేశీ ప్రయాణికులకు మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహిస్తుండగా ఇకపై దేశం నలుమూలల నుంచి ఏపీకి వచ్చే ప్రయాణికులకు కరోనా టెస్టులు చేస్తారు. ఎవరికైనా పాజిటివ్ వస్తే వారిని క్వారంటైన్ కు తరలించేలా చర్యలు తీసుకోనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com