ఏపీలో కొత్తగా గెలుపొందిన సర్పంచ్ లకు వారంలోగా చెక్ పవర్ అందనుంది. ఈ మేరకు గెలిచిన వారందరికీ చెక్ పవర్ బదలాయించేందుకు పంచాయతీ రాజ్ శాఖ చర్యలు చేపట్టింది. ఇందు కోసం బుధవారం నుంచి ఆన్ లైన్ లో గెలుపు ధ్రువీకరణ పత్రాలు, వారి ఇతర వివరాలు, డిజిటల్ సిగ్నేచర్ను వంటి వివరాలను సీఎఫ్ఎంఎస్లో నమోదు చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత చెక్ పవర్ బదిలీ కానుంది. కొత్తగా గెలుపొందిన సర్పంచ్ లు ఏప్రిల్ 3న పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.