ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా ప్రకటించిన స్టాలిన్‌

national |  Suryaa Desk  | Published : Tue, May 04, 2021, 10:30 AM

చెన్నై : డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ తమిళనాడులో జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా ప్రకటించారు. అన్ని దినపత్రికలు, అన్ని మీడియా రంగాల్లో పని చేసే వారిని కరోనా యోధులుగా పరిగణించనున్నట్లు తెలిపారు. మహమ్మారి సమయంలో జర్నలిస్టులు తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే పార్టీ జయకేతనం ఎగుర వేయగా.. ఈ నెల 7న ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.


ఇప్పటికే బిహార్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రులు జర్నలిస్టులను కరోనా యోధులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. . ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా గత నెల రోజుల్లో 52 మంది జర్నలిస్టులు మృతి చెందారు. నెలలో సగటున ఇద్దరు జర్నలిస్టులు మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పర్సెప్షన్‌ స్టడీస్‌ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. గతేడాది ఏప్రిల్‌ ఒకటి.. ఈ ఏడాది ఏప్రిల్‌ 20వ తేదీ మధ్య వంద మందికిపైగా జర్నలిస్టులు మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com