కరోనా వ్యాక్సిన్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు ఉచితంగానే టీకా పంపిణీ చేస్తామని ప్రకటించింది. ఎన్టీవి కథనం ప్రకారం.. ఒక్కో టీకా డోసు రూ.150 కొనుగోలు చేసి వాటిని రాష్ట్రాలకు ఫ్రీగా అందిస్తామని వెల్లడించింది. కాగా వ్యాక్సిన్ రేటు కేంద్రానికి ఓ ధర, రాష్ట్రాలకు మరో ధర విధించడం పట్ల రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది.