న్యూఢిల్లీ : రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రామ్నాథ్ తన ప్రసంగంలో ప్రేరణాత్మకమైన సందేశమిచ్చారని మోదీ పేర్కొన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యం, భిన్నత్వం, సామర్థ్యంలో దాగి ఉన్న విశేషాలను అద్భుతంగా కోవింద్ తన ప్రసంగంలో చెప్పారని మోదీ తెలిపారు.