విశాఖ: ఏ ఎన్నికైనా వైసీపీదే గెలుపు అని మంత్రి అవంతి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం అవంతి మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతిలో మళ్లీ ఎన్నికలు పెట్టినా వైసీపీదే గెలుపు అని చెప్పారు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఓటమిని ఒప్పుకునే ధైర్యం లేదన్నారు. చంద్రబాబు అప్పట్లో నేతలను తిట్టేవారు.. ఇప్పుడు ప్రజలను తిడుతున్నారని వ్యాఖ్యానించారు. జగన్కు ఓటేస్తే చెడ్డవాళ్లు.. టీడీపీకి ఓటేస్తే మంచివాళ్లా? అని నిలదీశారు. టీడీపీ పరిస్థితి ఏంటో అచ్చెన్నాయుడే చెప్పారని అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు.