ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 24, 2017, 11:17 AM

 అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పీడీ3లోని గులే దవాఖానా ప్రాంతంలో ప్రముఖ రాజకీయ నాయకుడు మహ్మద్‌ మోహాఖిక్‌ ఇంటికి సమీపంలో ముష్కరులు కారు బాంబుతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడినట్లు స్థానిక మీడియా పేర్కొంది.


ఘటనను అఫ్గాన్‌ హోంమంత్రిత్వ శాఖ నజీబ్‌ దానిశ్‌ ధ్రువీకరించారు. కీలక రాజకీయ నాయకుల నివాసాలు ఉన్న చోట పేలుడు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతమంతా ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఘటనకు బాధ్యత వహిస్తూ.. ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. కాగా.. అఫ్గాన్‌లో తాలీబన్‌ ఉగ్రవాదులు తరచుగా దాడి చేస్తుండటం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com