విజయవాడ: రాష్ట్ర విభజన అనంతరం ఆంద్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖకు తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ.137కోట్లు రావాల్సి ఉందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. విజయవాడలో పౌరసరఫరాల సంస్థ నూతన కార్యాలయాన్ని ఛైర్మన్ లింగారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. విభజన తర్వాత ప్రభుత్వ శాఖలు వేరైనప్పటికీ కార్పోరేషన్ల విషయంలో ఇంకా పూర్తిస్థాయి విభజన జరగలేదన్నారు. తెల్లకార్డుదారులకు కేంద్రం పంచదార, నీలి కిరోసిన్ నిలిపివేసిన నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పౌరసరఫరాల శాఖ కార్యకలాపాలు ఇక నుంచి విజయవాడ నుంచే కొనసాగుతాయని తెలిపారు.