రైల్వే కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్న్యూస్. నార్త్ సెంట్రల్ రైల్వే 480 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. టెన్త్తో పాటు ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 16లోగా దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఖాళీలు: 480
ఫిట్టర్- 286
వెల్డర్- 11
మెకానిక్- 84
కార్పెంటర్- 11
ఎలక్ట్రీషియన్- 88
విద్యార్హతలు: కనీసం 50 శాతం మార్కులతో టెన్త్ క్లాస్ పాసై ఉండాలి. దీంతో పాటు NCVTకి అనుబంధ సంస్థ నుంచి ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: అభ్యర్థులు వయసు 15-24 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.170, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు.
దరఖాస్తుకు చివరితేది: ఏప్రిల్ 16, 2021
వెబ్సైట్:https://ncr.indianrailways.gov.in/ లేదా https://www.mponline.gov.in/