ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్యపై అనుమానం.. పెళ్లైన నెలన్నరకే హత్య

national |  Suryaa Desk  | Published : Mon, Mar 22, 2021, 12:47 PM

పెళ్లి చేసుకుని రెండు నెలలైనా గడువక ముందే అనుమానం ఆ దంపతుల జీవితంలో పెను తుఫాను రేపింది.భార్యపై అనుమానం పెంచుకున్న భర్త గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఆదివారం తమిళనాడులో చోటు చేసుకుంది. తిరువళ్లూరు జిల్లా ఎగువనల్లాటూరు గ్రామానికి చెందిన గోపి(36). చెన్నై ఆలందూరులో ఆటో డ్రైవర్. అదే ప్రాంతానికి చెందిన భర్త నుంచి విడాకులు పొందిన మహేశ్వరిని ఫిబ్రవరి 14న పెళ్లి చేసుకున్నాడు. వివాహం అనంతరం ఎగువనల్లాటూరులో కాపురం పెట్టారు. ఈ క్రమంలో శనివారం భార్య ప్రవర్తనను అనుమానించిన గోపి ఆమెతో గొడవ పడ్డాడు. దీంతో తాను ఆదివారం ఆలందూరుకు వెళ్లిపోతానని భార్య చెప్పడంతో కోపోద్రేకుడైన గోపి.. గొంతు కోసి మహేశ్వరిని కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అనంతరం రిమాండ్ కు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com