దేశంలో కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తోంది. మహారాష్ట్రలో నిన్న ఒక్క రోజే 9,855 కరోనా కేసులు నమోదయ్యాయి. గతేడాది అక్టోబర్ 17 తరువాత ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గతేడాది అక్టోబర్ 17న మహారాష్ట్రలో అత్యధికంగా 10,259 కేసులు నమోదయ్యాయి. ముంబై, పూణే, నాగపూర్, థానే ప్రాంతాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో కేసులను కంట్రోల్ చేయకుంటే, మిగతా రాష్ట్రాలకు కేసులు వ్యాపించే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికులపై అనేక రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి.