ట్రెండింగ్
Epaper    English    தமிழ்

థాయ్ ఓపెన్ రెండో రౌండ్లో సైనా ఓటమి

national |  Suryaa Desk  | Published : Sat, Jan 16, 2021, 02:16 PM

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 1000 మహిళల సింగిల్స్‌ సెకండ్‌ రౌండ్లో సైనా నెహ్వాల్‌ ఓటమిపాలైంది. థాయ్‌ షట్లర్‌ , ప్రపంచ 12వ ర్యాంకర్‌ బుసానన్‌ చేతిలో సైనా 23-21, 14-21, 16-21తేడాతో ఓడింది. హోరా హోరీగా దాదాపు 68 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో సైనా పోరాడి ఓడింది. చాలా కాలం తర్వాత అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ కోర్టులో అడుగుపెట్టిన సైనా ఓటమిపాలైంది. తొలి గేమ్‌లోనే వీరిద్దరూ అంచనాలకు మించి పోరాడటంతో విజయం ఇరువురి వైపు ఊగిసలాడింది. చివరకు సైనా సుదీర్ఘ ర్యాలీలతో రాణించి 23-21తో తొలి గేమ్‌ను గెలుచుకుంది. అయితే చివరి రెండు గేముల్లో బుసానన్‌ పుంజుకుని ఆధిక్యం సాధించింది. 14-21, 16-21 తేడాతో సొంతం చేసుకుని విజయం సాధించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో రెండో రౌండ్లో కిదాంబి శ్రీకాంత్‌ వాకోవర్‌ ప్రకటించాడు. మలేసియా ఆటగాడు లీ జి జియాతో ఆడాల్సి ఉండగా కాలి కండరాలు పట్టేయడంతో తప్పుకున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com