ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆలయాలపై దాడుల వెనుక ఆ నేతలు: ఏపీ డీజీపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 16, 2021, 11:36 AM

ఆంధ్రప్రదేశ్‌లో పలు ఆలయాలపై దాడుల వెనుక రాజకీయ నేతల ప్రమేయం ఉందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. అందులో టీడీపీ, బీజేపీ నేతల హస్తం ఉందని వెల్లడించారు. 17 మంది టీడీపీ నేతలు, నలుగురు బీజేపీ నేతల హస్తం ఉందని డీజీపీ సవాంగ్ స్పష్టం చేశారు. ఇప్పటికే 13 మంది టీడీపీ నేతలు, ఇద్దరు బీజేపీ నేతలను అరెస్ట్‌ చేసినట్లు డీజీపీ సవాంగ్‌ పేర్కొన్నారు. ఏపీలో మతవిద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అదే సమయంలో ఆలయాలపై దాడుల్ని రాజకీయం చేయొద్దని ఆయన రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. మతాల మధ్య వైషమ్యాలు సృష్టించేవారిపై కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్చలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరుగకుండా ఆలయాల వద్ద సీసీ కెమెరాలతో భద్రత పెంచుతున్నామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com