ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విషాదం.. బాలుడితో సహా దంపతుల ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 12, 2021, 05:20 PM

పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. పాలకోడేరు మండలం కుముదవల్లి శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు పరశురాం, సత్యవతి, ఏడాదిన్నర బాలుడిగా గుర్తించారు. వారి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని బంధువులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హైమావతి అనే మహిళకు మృతులు రూ.46 లక్షలు ఇచ్చినట్లు మృతుల బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె డబ్బుతో పారిపోవడంతోనే వీరు ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డారని చెబుతున్నారు. విచారణలో అసలు విషయాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com