గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ నివాసంలో దుండగులు భారీ చోరీకి తెగబడ్డారు. ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు దాదాపు 800 గ్రాముల బంగారం, రూ.60 వేల నగదును అపహరించారు. కమాండర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు మంగళగిరి నియోజకవర్గంలో జరుగుతున్న వరుస చోరీ ఘటనలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.