ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మ్యాచ్ మధ్యలో నగ్నంగా పరిగెత్తుకొచ్చిన అభిమాని

international |  Suryaa Desk  | Published : Mon, Dec 28, 2020, 01:23 PM

న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఓ వింత దృశ్యం అటు ఆటగాళ్లకు ఇటు ప్రేక్షకులకు షాకిచ్చింది. మ్యాచ్ జరుగుతుండగా ఓ వ్యక్తి నగ్నంగా మైదానంలోకి పరిగెత్తుకొని వచ్చేశాడు. తన మర్మాంగాన్ని చేతులతో దాచుకొని మైదానం చుట్టూ పరుగుతీశాడు. ఈ టెస్టు మ్యాచ్ తొలి రోజే ఇలాంటి ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది.. వెంటనే అప్రమత్తమయ్యారు. అతనిపైకి దూకి మరీ పట్టుకున్నారు.
ఇలా మైదానంలోకి నగ్నంగా రావడమే కాకుండా.. తన ఘనకార్యాన్ని మొబైల్‌లో బంధించాడు.సెల్ఫీ కెమెరా ఆన్ చేసుకొని ఓ వీడియో తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఘటన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసింది. ఈ వింత దృశ్యంతో అంతా షాక్ అయ్యారు. ఆ అభిమానిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com