ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్ కు టీమిండియా నాలుగు మార్పులతో బరిలోకి దిగుతోంది. శుభ్మన్ గిల్, పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ టెస్టుల్లో డెబ్యూట్ మ్యాచ్ ఆడనున్నారు. పృథ్వి షా స్థానంలో గిల్ద్, షమి స్థానంలో సిరాజ్ను తీసుకున్నారు. కేఎల్ రాహుల్ కు మరోసారి నిరాశే ఎదురైంది. రవీంద్ర జడేజా, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా స్థానంలో రిషబ్ పంత్ టీమ్ లోకి వచ్చారు.
టీం: మయాంక్ అగర్వాల్, శుభ్మన్ గిల్, చటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, హనుమ విహారీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్