చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ను సన్రైజ్ రాష్ట్రంగా తయారు చేస్తే.. జగన్రెడ్డి ఆత్మహత్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దారని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ విమర్శించారు. గురువారం ఆమె మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఏడాదిన్నరలో లక్ష కోట్లకు పైగా అప్పులు చేసిందని ఆరోపించారు. 750 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే అందుకు వైసీపీ ప్రభుత్వ విధానాలే కారణమన్నారు.
90 మందికిపైగా రాజధాని రైతులు చనిపోయినా జగన్రెడ్డికి పట్టదా? అని పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. జగన్రెడ్డి పాలనలో దోపిడీ వర్గమే సంతోషంగా ఉందన్నారు. పసి పిల్లలు చనిపోయినా జగన్మోహన్రెడ్డిలో చలనం లేదని, అరాచకాల్లో ఏపీ బిహార్ను మించి పోయిందని విమర్శించారు. రాష్ట్రంలో హత్యలు, ఆత్మహత్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలని అనురాధ డిమాండ్ చేశారు.