భారతరత్న డా.బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగుతోంది అని హోంమంత్రి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో సోమవారం సాయంత్రం జరిగిన సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదలు మహిళలకు అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్టం సర్వతోముఖాభివృద్ది చెందుతుంది అన్నారు.