ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి: అంబటి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 10, 2017, 03:15 PM

పార్టీ ప్లీనరీ సమావేశాల్లో తమ అధినేత జగన్ ప్రకటించిన తొమ్మిది కార్యక్రమాలు టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ వెన్నులో చలి మొదలైందని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ చూసినా జగన్ ప్రకటించిన కార్యక్రమాల గురించే చర్చించుకుంటున్నారని తెలిపారు. జగన్ ప్రకటనతో టీడీపీ, నారా లోకేష్ ల భవిష్యత్తు నట్టేట మునిగినట్టేనని అన్నారు. ఇది చూసి ఓర్వలేకే జగన్ మరోసారి జైలుకు వెళతారని టీడీపీ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని తెలిపారు. జగన్ బయట ఉంటే చంద్రబాబుకు పుట్టగతలు ఉండవని అందుకే ఆయనను మళ్లీ జైలుకు పంపే కుట్రలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. మద్యాన్ని నిషేధిస్తామని జగన్ ప్రకటించారని చెప్పారు. అవినీతి చక్రవర్తి పుస్తకంలో తాము పేర్కొన్న ప్రతి అవినీతిని ఆధారాలతో సహా నిరూపించేందుకు తాము సిద్ధమని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com