ఉల్లి సరఫరాకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ రోజిక్కడ మాట్లాడిన ఆయన ఉల్లిపాయల ఎగుమతిపై సెప్టెంబర్ 14తేదీ నుండి నిషేధం విధించామని అన్నారు.అందువల్లే ధరలు దిగివస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వమే పైవేటు ఏజెన్సీల ద్వారా దిగుమతులను చేపడుతోందని చెప్పారు. నిత్యావసర వస్తువుల చట్టం కింద అక్టోబర్ 23 నుంచి ఉల్లిపాయల నిల్వ పరిమితిని, టోకు వ్యాపారులకు 25 మెట్రిక్ టన్నుల చొప్పు న , చిల్లర వ్యాపారులకు 2 మెట్రిక్ టన్నుల చొప్పున విధించడం జరిగిందన్నారు. అంతేకాదు ఉల్లి విత్తనాల ఎగుమతిని కూడా నిషేధించడం జరిగిందని పేర్కొన్నారు. పెరుగుతున్న ఉల్లిపాయల ధరలను దృష్టిలో ఉంచుకుని, ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా, మిగులు నిల్వల నుండి ఉల్లిపాయలను సరఫరా చేయడం జరుగుతుందని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ పంట కాలంలో రికార్డు స్థాయిలో 742 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించడానికి, భారత ఆహార సంస్థ ,రాష్ట్ర ఏజెన్సీలు, సిద్ధంగా ఉన్నాయన్నారు.