ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్ఈసీని కోరినట్లు సీపీఐ నేత రామకృష్ణ తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలని, ప్రభుత్వ అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవాలని చెప్పామన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్చి నెలలో నిర్వహించిన ఎన్నికలను రద్దు చేయాలన్నారు. ఎందుకంటే అవి అప్రజాస్వామికంగా జరిగాయన్నారు. ప్రభుత్వం, అధికారులు, పోలీసులు కుమ్మక్కయ్యారని, ఆ ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయన్నారు. వాటన్నింటిని రద్దు చేసి.. సమగ్ర దర్యాప్తు చేయాలని, కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్ఈసీని కోరినట్లు రామకృష్ణ చెప్పారు.