ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగులకు కేంద్రం అదిరిపోయే తీపికబురు

national |  Suryaa Desk  | Published : Fri, Oct 23, 2020, 01:36 PM

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు తీపికబురు అందించింది. ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త తీసుకువచ్చింది. పండుగ సీజన్ నేపథ్యంలో అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. కేబినెట్ 30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్ అందిస్తామని ప్రకటించింది.కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ విషయాన్ని తెలియజేశారు. బోనస్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.3,737 కోట్లు అందిస్తామని పేర్కొన్నారు. మీరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మీకు ఈ బోనస్ డబ్బులు వస్తాయా? రావా? అనే ప్రశ్న వచ్చే ఉంటుంది. మీకు కేంద్ర ప్రభుత్వం అందించే బోనస్ డబ్బులు వస్తాయో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.


ప్రభుత్వానికి చెందిన ఇండియన్ రైల్వేస్, పోస్టాఫీస్, డిఫెన్స్ ప్రొడక్షన్, ఈపీఎఫ్‌వో, ఈఎస్ఐసీ వంటి వాటిల్లో దాదాపు 17 లక్షల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు ఉన్నారు. వీరందరికీ ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెన్‌టివ్ (పనితీరు ఆధారిత ప్రోత్సాహకం) రూ.2,791 కోట్ల బోనస్ వస్తుంది. వీరు కాకుండా 13 లక్షల మంది ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వంలో పని చేస్తున్నారు. వీరందరికీ నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ కింద రూ.946 కోట్లు చెల్లిస్తారు.


 


మోదీ సర్కార్ ప్రకటించిన బోనస్ మొత్తం ఉద్యోగుల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా వచ్చి చేరుతుంది. దీంతో పండుగ సీజన్‌లో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. బోనస్ వల్ల మధ్యతరగతి ప్రజల చేతిలోకి డబ్బులు వస్తాయని జవదేకర్ తెలిపారు.బోనస్ డబ్బులు ఒక్కో ఉద్యోగి ప్రాతిపదికన మారొచ్చు. రైల్వేస్, పోస్టాఫీస్, పీఎఫ్ వంటి పలు సంస్థలకు చెందిన ఉద్యోగులకు బోనస్ డబ్బులు ఉద్యోగి పనితీరు, సంస్థ పనితీరు ప్రాతిపదికన చెల్లిస్తారు. అందువల్ల వీరికి కరెక్ట్‌గా ఎంత బోనస్ వస్తుందో చెప్పడం కష్టం. హెచ్ఆర్ అధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.కాగా కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం బోనస్ డబ్బులు ఇస్తుందా? లేదా? అని చాలా మందిలో అనుమానాలు ఉండేవి. కానీ కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఈ అనుమానాలు అన్నీ తొలగిపోయాయి. ఉద్యోగులకు పండుగ బోనస్ లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావం పడనుంది. డిమాండ్ పుంజుకునే ఛాన్స్ ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com