ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన గాయపరిచిన సంఘటన చీరాల పట్టణ పరిధిలోని ఆదినారాయణపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆదినారాయణపురానికి చెందిన రాజు అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన మాదిగాని శరత్ బాబును మద్యం తాగేందుకు డబ్బులు అడిగాడు. తనవద్దలేవని చెప్పడంతో ఆగ్రహం చెందిన రాజు శరత్ బాబుని కత్తితో పొడిచి గాయపరిచాడు. దీంతో బాధితుడు చీరాల ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు .