బీజేపీ విశాఖపట్నం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు రవీంద్ర అధ్యక్షతన కార్యాలయంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 104వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ మాధవ్ విచ్చేసారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ...అంత్యోదయ సిద్ధాంతకర్త, కర్మయోగి, స్ఫూర్తి ప్రదాత, అపార దేశభక్తుడు, కర్మయోగి దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ అని కొనియాడారు. వారు 1916లో సాధారణ కుటుంబంలో జన్మించి అసాధారణ స్థాయికి ఎదిగారు అని తెలిపారు. బీజేపీకి సిద్ధాంతాన్ని సృష్టించిన సిద్ధాంత కర్త, ప్రభుత్వ ఫలాలు చిట్టచివరి వ్యక్తికీ చేరాలని బలంగా సంకల్పించుకొని అంత్యోదయ సిద్ధాంతాన్ని రూపొందించిన మహనీయుడు అని తెలిపారు.