16 సంవత్సరాల బాలిక బ్యాంక్ అకౌంట్లో రూ.10 కోట్లు డబ్బులు పడ్డాయి. ఉత్తర్ ప్రదేశ్లో ఈ ఘటన జరిగింది. దీంతో వెంటనే బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. యూపీలోని కాన్పూర్ దేహత్ జిల్లాకు చెందిన నీలేష్ కుమార్ అనే వ్యక్తి రెండు సంవత్సరాల క్రితం తన ఆధార్ కార్డు, ఫొటో తీసుకున్నారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సరోజ్ అనే 16 సంవత్సరాల బాలిక చదువుకోలేదు. ఆమెకు 2018 నుంచి అలహాబాద్ బ్యాంక్లో ఖాతా ఉంది. ఆమె సోమవారం రోజు బ్యాంకుకు వెళ్లింది. ఆమె ఖాతాలో రూ.9.99 కోట్లు నగదు జమ అయినట్టు బ్యాంకు అధికారులు చెప్పారు. కూలి పని చేసుకునే తన ఖాతాలో అంత డబ్బులు ఉన్నట్టు బ్యాంకు అధికారులు చెప్పడంతో ఆమె షాక్ తింది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. తనకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదని చెప్పింది. నీలేష్ అనే వ్యక్తి అప్పుడప్పుడు తనకు ఫోన్ చేస్తాడని, అతడి ఫోన్ నెంబర్ను పోలీసులకు అందజేసింది. అయితే, ఆ ఫోన్ నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ ఉంది. సరోజ్ అనే బాలిక పలుమార్లు రూ.10,000 నుంచి రూ.20,000 వరకు పలుమార్లు బ్యాంకులో డిపాజిట్ చేసి విత్ డ్రా చేసిందని బ్యాంక్ మేనేజర్ తెలిపారు.