ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశం‌లో 90వేలు దాటిన కరోనా మరణాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 23, 2020, 11:35 AM

భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 83,347 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో నమోదైన కేసుల సంఖ్య 56,46,011కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 45,87,614 మంది కోలుకున్నారు. 9,68,377 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నిన్న ఒక్క రోజే 1085 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మృతుల సంఖ్య 90,020కి పెరిగింది.
కరోనా బాధితుల రికవరీ రేటు 81.25శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.59శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజులోనే 9,53,683 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. మొత్తంగా 6,62,79,462 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com