తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా 1.13 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది . శనివారం వచ్చిన మొత్తం ఆదాయాన్ని ఆదివారం లెక్కించగా ఈ మేరకు ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు తెలిపారు . ఆదివారం రోజున 13851 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని , 4257 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారని టీటీడీ అధికారులు తెలిపారు .