ఏపీ హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురు అయ్యింది. మూడు రాజధానులు, సీఆర్డీఏ వ్యవహారంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. స్టేటస్ కోను అక్టోబర్5 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు పొడిగించింది. తదుపరి విచారణను అక్టోబర్ 5కు వాయిదా వేసింది. ప్రస్తుతం రాజధానిపై ఉన్న స్టేటస్కో అక్టోబర్ 5వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. వచ్చేనెల 5నుంచి రోజువారీ విచారణ జరుపుతామని ఏపీ హైకోర్టు తెలియజేసింది. రాజధాని బిల్లులలు అమలు చేయకుండా స్టేటస్ కో కొనసాగుతుందని ధర్మాసనం తెలిపింది. హైకోర్టు స్టేటస్ కోను ఇప్పటి వరకు రెండుసార్లు పొడిగిచింది.
ఆగస్టు నెలలో రాజధానుల పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి సెప్టెంబర్ 11 వరకు సమయం ఇచ్చింది.. అలాగే అభ్యంతరాలు చెప్పేందుకు సెప్టెంబర్ 17 వరకు గడువు ఇచ్చింది. సెప్టెంబర్ 21 నుంచి రోజూ విచారణ జరుపుతామని తెలిపింది. మరోవైపు మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఈ పిటిషన్ను ధర్మాసనం తోసిపుచ్చింది. హైకోర్టు విచారణ చేస్తున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.