ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుశాంత్ కేసుపై ఆ సీనియర్ హీరోయిన్ల రగడ

national |  Suryaa Desk  | Published : Fri, Sep 18, 2020, 06:36 PM

యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. సుశాంత్ మరణించి మూడు నెలలు గడిచినా నిజాలు బయటకురాకపోవడం, పైగా రోజులో కొత్త అంశం తెరమీదకు వస్తుండటం జనాన్ని అయోమయంలో పడేస్తోంది. ఈ కేసు విషయమై రంగంలోకి దిగిన సీబీఐ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు లోతైన విచారణ చేపడుతున్న క్రమంలో తాజాగా సీనియర్ నటి, కాంగ్రెస్ నాయకురాలు నగ్మ సంచలన కామెంట్స్ చేసింది. ఇక రీసెంట్‌గా 'రేసు గుర్రం' సినిమాలో విలన్‌గా నటించిన ఎంపీ రవికిషన్ పార్లమెంటు సాక్షిగా బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ డ్రగ్స్‌కు బానిస అయిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను జయప్రద సమర్ధించింది. అంతేకాకుండా జయాబచ్చన్ దీనికి వ్యతిరేకంగా మాట్లడటం సరికాదని కౌంటర్ వేస్తూ ఈ ఇష్యూను రాజకీయం చేస్తున్నారని, డ్రగ్స్కు వ్యతిరేకంగా అందరూ పోరాడాల్సిన అవసరం ఉందని జయప్రద పేర్కొంది.తాజాగా ఈ ఇష్యూలోకి ఎంటరైన నగ్మ.. బీజేపీ నాయకుల తీరును తప్పుబడుతూ జయప్రదకు కౌంటర్ ఇచ్చింది. ''ఎన్‌సీబీ, ఈడీ, సీబీఐ దయచేసి సుశాంత్ కేసులో ఏం జరుగుతుందో జయప్రద గారికి తెలియజేయండి. ఈ కేసు విషయంలో వివరాల కోసం అందరూ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ కేసును పక్కదోవ పట్టించడానికే బీజేపీ నేతలు డ్రగ్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం దేశమంతా సుశాంత్ కు న్యాయం జరగాలని, ఆయన మరణం వెనక కారణాలు తెలుసుకోవాలని చూస్తోంది'' అని పేర్కొంటూ ట్వీట్ చేసింది నగ్మ. ప్రస్తుతం ఆమె చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com