మహిళల ముఖాల్లో చిరునవ్వు చూడాలన్నదే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అని మాజీ ఎంపిటిసి, వైసీపీ సీనియర్ నాయకురాలు “పాలంగి ఉమాదేవి” అన్నారు. మండలంలోని పినపళ్ళలో పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం వైయస్ఆర్ “ఆసరా” వారోత్సవాల్లో భాగంగా “ఆసరా” పథకం ద్వారా లబ్ధి పొందిన డ్వాక్రా సంఘాల మహిళలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలంగి ఉమాదేవి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్కా చెల్లెమ్మకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చడానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.