ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చలో అమలాపురానికి తరలిరండి. : బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 17, 2020, 02:00 PM

అంతర్వేది ఘటనలో హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా దేవాలయాలపై దాడులు జరుగుతున్నందుకు నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళిన వారిపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేయడం దారుణమని దీనిపై ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని దానికి నిరసనగా బిజెపి పార్టీ పిలుపుమేరకు రేపు శుక్రవారం చలో అమలాపురానికి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల 5 పార్లమెంటులో ఉన్న బిజెపి నాయకులు ఉదయం 10 గంటలకల్లా తరలిరావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పిలుపునిచ్చారు. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నప్పటికీ వాటిమీద కేసుల నమోదు చేయకుండా ప్రభుత్వం తీరు ఉందని గతంలో అంతర్వేది ఘటనలో అంతర్వేది వెళతారు అనే సమాచారం తో బిజెపి నాయకులను పోలీసుల గృహనిర్బంధం చేయడం పోలీసులు కూడా సెక్షన్ 30 అమల్లో ఉందని చెప్పి పోలీసులు కూడా చట్టాన్ని ఉపయోగిస్తున్నారని చట్టం ప్రభుత్వం కి లోబడి పని చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని ఈ విషయంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని సోము వీర్రాజు  మీడియాతో అన్నారు. పార్టీలపై చట్టాన్ని కఠినంగా  వినియోగించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని సోము వీర్రాజు అన్నారు. అంతర్వేది ఘటనలో పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ తో చలో అమలాపురానికి పిలుపును ఇవ్వడం జరిగిందని సోము వీర్రాజు అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com