తిరుపతి పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బల్లి దుర్గాప్రసాద్ ఈరోజు సాయంత్రం 6 గంటల సమయంలో చెన్నై అపోలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నాలుగు సార్లు గూడూరు ఎమ్మెల్యే గా గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ ఒకసారి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరారు.