పుల్వామాలోని మార్వాల్ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఎన్కౌంటర్ ప్రారంభమైంది. పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ను చేపడుతున్నాయి. ఇటీవల కొద్ది రోజులుగా జమ్మూకశ్మీర్లోని ఉగ్రవాదుల ఏరివేత ముమ్మరంగా కొనసాగుతోంది. పోలీసులు, భద్రతా బలగాలు ముమ్మర తనిఖీలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం మార్వాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు సోదాలు నిర్వహించగా.. బలగాలను చూసి ఉగ్రవాదులకు కాల్పులకు తెగబడినట్లు సమాచారం. కాగా, ఈ నెల 11న బుద్గాం జిల్లాలో కవూసా ఖలీసా ప్రాంతంలోనూ భద్రతా బలగాల కాల్పులల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అలాగే ఈ నెల 7న గాలింపు బృందాలపై కాల్పులు జరిపిన ఉగ్రవాది.. సెక్నాగ్ నాలాలో దూకాడు. అయితే అప్పటికే బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో అతని మెడకు తీవ్రంగా గాయమై మృతి చెందగా, మృతదేహం నాలాలో బయటపడింది.