ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుల్వామాలో ఎన్‌కౌంటర్‌

national |  Suryaa Desk  | Published : Tue, Sep 15, 2020, 09:32 AM

 పుల్వామాలోని మార్వాల్‌ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైంది. పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను చేపడుతున్నాయి. ఇటీవల కొద్ది రోజులుగా జమ్మూకశ్మీర్‌లోని ఉగ్రవాదుల ఏరివేత ముమ్మరంగా కొనసాగుతోంది. పోలీసులు, భద్రతా బలగాలు ముమ్మర తనిఖీలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం మార్వాల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు సోదాలు నిర్వహించగా.. బలగాలను చూసి ఉగ్రవాదులకు కాల్పులకు తెగబడినట్లు సమాచారం. కాగా, ఈ నెల 11న బుద్గాం జిల్లాలో కవూసా ఖలీసా ప్రాంతంలోనూ భద్రతా బలగాల కాల్పులల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అలాగే ఈ నెల 7న గాలింపు బృందాల‌పై కాల్పులు జ‌రిపిన ఉగ్రవాది.. సెక్‌నాగ్ నాలాలో దూకాడు. అయితే అప్పటికే బ‌ల‌గాలు ఎదురు కాల్పులు జ‌ర‌ప‌డంతో అత‌ని మెడ‌కు‌ తీవ్రంగా గాయమై మృతి చెందగా, మృతదేహం నాలాలో బ‌య‌ట‌ప‌డింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com