నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నియోజకవర్గ ప్రజల సమస్యలపై స్పందించారు. నరసాపురం ప్రాంత ప్రజలు హైదరాబాద్ నగరానికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కరోనా కారణంగా విధించిన అంతర్రాష్ట్ర ప్రయాణ పరిమితులు ఇప్పుడు ఎత్తివేయడం జరిగిందని, అందువల్ల ప్రతి రోజు నరసాపురం-హైదరాబాదు రైలును నడిపేలా చర్యలు తీసుకోవాలని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ ను కోరారు. ఈ మేరకు డీఆర్ఎమ్ కు లేఖ రాశారు. వీలైతే ఈ వారం నుంచే రైలును నడపాలని రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు.