మహానేత దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్బంగా ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారి నేతృత్వంలో వైస్సార్సీపీ నాయకులు వివిధ సేవ కార్యక్రమలు చేయడం జరిగింది. శ్రీరామ్ నగర్ నందు వార్డు నాయకులు మంగమ్మ మరియు సుహాసిని గార్ల ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. స్థానిక బుధవరపేటలో కేదార్నాథ్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. ఆలాగే ముఖ్యఅతిధి అయినా బివై రామయ్య గారి చేతుల మీదగా అన్నదానం చేయడం జరిగింది.అలాగే పుల్లారెడ్డి కాలేజీ సమీపంలో ఉన్న అనాధ ఆశ్రమంలో మల్లికార్జున, సాంబశివారెడ్డి రెడ్డిపోగు ప్రశాంత్ మరియు గౌతమ్ వారి టీం ఆధ్వర్యంలో బివై గారి చేతుల మీదగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరియు రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో వైస్సార్సీపీ 46వ వార్డు షహీద్ మరియు వారి టీం ఆధ్వర్యంలో నిరాశ్రయలకు అన్నదానం చేయడం జరిగింది. అలాగే కుమ్మరి గేరి 4వ వార్డు నాయకులు మహేంద్ర మరియు శివ వారి ఆధ్వర్యంలో అన్నదానం చేయడం జరిగింది అంతే కాక ఎన్నో వివిధ ప్రజా సేవ కార్యక్రమలు చేస్తూ మహా నేత రాజశేఖర్ రెడ్డి గారికి ఘన నివాళి అర్పించారు.