ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్కు కరోనా సోకింది. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆయన్ను హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. షరీఫ్ త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్సీలు, తెదేపా నేతలు ఆకాంక్షించారు.
మరోవైపు కరోనా కేసుల నమోదులో సంఖ్యాపరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండో స్థానానికి చేరింది. ఇప్పటివరకూ ఆ స్థానంలో ఉన్న తమిళనాడును వెనక్కు నెట్టి ఆ స్థానాన్ని ఏపీ ఆక్రమించింది. మహారాష్ట్ర 7,80,689 కేసులతో తొలిస్థానంలో ఉంది. తాజాగా కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల మేరకు 1.40 లక్షల కేసులతో ఆగస్టులోకి ప్రవేశించిన ఆంధ్రప్రదేశ్ 31 వతేదీ సాయంత్రానికి 4,34,771 కేసులకి చేరింది. నెలరోజుల్లో రాష్ట్రంలో సుమారు 2.94లక్షల కేసులు పెరిగాయి. ఇదే సమయంలో తమిళనాడు 2.45 లక్షల నుంచి 4,28,041 కరోనా కేసులకు చేరింది. ఆగస్టు నెల తొలినాళ్ళలో తమిళనాడు కంటే 1.05 లక్షల మేర కేసులతో వెనుకబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ నెల చివరి నాటికి దానికంటే (2,682 కేసులు) ఒక మెట్టు పైకి ఎదిగింది.