భూ సమీకరణలో భూములు ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలుకు సంబంధించి రూ. 158 కోట్లు, 2 నెలల పెన్షన్ మొత్తం రూ. 9.73 కోట్లు విడుదల చేసినట్లు పురపాలక శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ తెలిపారు. ఆ మొత్తాలు వారి బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతాయని తెలిపారు. అమరావతిలో భూములు ఇచ్చిన వారికి కౌలు ఇవ్వలేదని నిరసన చేశారన్న బొత్స.. నిన్న బ్యాంక్లో రైతులకు డబ్బులు జమ చేశామని అన్నారు. ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయని విమర్శించారు. కొన్ని సాంకేతిక సమస్యలు వల్ల డబ్బలు జమ చేసే ప్రక్రియలో ఆలస్యం జరిగిందని అన్నారు. భూ హక్కు పత్రాలు అమ్ముకున రైతులకి కౌలు ఉండదని బొత్స తెలిపారు. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి సిద్ధమైతే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని.. పేదవారికి లబ్ది కలగకుండా అడ్డుకోవద్దని తెలిపారు. సంక్షేమ పథకాలను అడ్డుకుంటే ప్రజల ఆగ్రహానికి గురవుతారని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.