లండన్: మహిళల ప్రపంచ వన్డే కప్లో భాగంగా భారత్ గురువారం వెస్టిండీస్తో తలపడనుంది. టోర్నీలో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్తో తలపడి 35 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించింది ఓపెనర్ స్మృతి మందన. 100బంతుల్లో 90 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకుంది.
ఈ నేపథ్యంలో స్మృతి ఓ టీవీ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... క్రికెట్లో తనకు స్ఫూర్తి యువరాజ్ సింగ్ అని తెలిపింది. ఎవరైతే ప్రపంచకప్ అందించాలన్న పట్టుదలతో దేశం తరఫున ఆడారో ఆ ఆటగాడు యువరాజ్ సింగ్ అని, అతనే తనకు స్ఫూర్తి అని స్మృతి చెప్పింది.ఐదు వన్డేల సిరీస్లో భాగంగా కోహ్లీ సేన విండీస్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య మూడో వన్డే శుక్రవారం జరగనుంది.