ముంబయి: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా తన స్నేహితులు, పలువురు బాలీవుడ్ ప్రముఖులను ఆహ్వానించి పార్టీ ఏర్పాటు చేశారు. ఆయన స్వగృహంలో మంగళవారం రాత్రి జరిగిన ఈ పార్టీలో కరీనా కపూర్ ఖాన్, కత్రినా కైఫ్, మలైకా అరోరా, అమృతా అరోరా, నేహా దూపియా, సోఫీ చౌదరి తదితరులు పాల్గొని సందడి చేశారు. భర్త సైఫ్ అలీ ఖాన్తో వచ్చిన కరీనా ఎరుపురంగు దుస్తుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ పార్టీలో తీసిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.