ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పడవ బోల్తా పడి 10 మంది మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 18, 2020, 11:44 AM

పాకిస్థాన్​లోని దక్షిణ సింధ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. తట్టాలోని కీన్​ఝార్​ సరస్సులో ఓ పడవ బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మరణించారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఇద్దరు చిన్నారు ఉన్నారు.విహార యాత్ర కోసం కీన్​ఝార్​ సరస్సు సమీపంలోని రిసార్టుకు వచ్చింది ఆ కుటుంబం. అక్కడే ఓ పడవ అద్దెకు తీసుకుని సరస్సులో ప్రయాణిస్తుండగా బలమైన గాలుల కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.పడవలో 13 మంది ఉండగా ముగ్గురుని స్థానిక ఈతగాళ్లు రక్షించారు. 10 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com